Nara Lokesh: రక్తదానం చేసిన నారా లోకేశ్

  • నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం
  • రక్తదానం ప్రాణదానంతో సమానం అన్న లోకేశ్
  • అందరూ రక్తదానం చేసేలా అవగాహన కల్పిద్దామని వ్యాఖ్య
Nara Lokesh donates blood

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అందరిలో ఉన్న అపోహలను పోగొట్టి, అందరూ రక్తదానానికి ముందుకు వచ్చేలా అవగాహన కల్పిద్దామని చెప్పారు. మరోవైపు ఈ కార్యక్రమం సందర్భంగా పలువురు టీడీపీ శ్రేణులు రక్తదానం చేశారు. 

More Telugu News