ఆత్మకూరులో భారీ మెజారిటీ లక్ష్యంగా వైసీపీ వ్యూహం... 7 మండలాలకు ఇంచార్జీలుగా ఏడుగురు మంత్రులు
- ఆత్మకూరు ఉప ఎన్నికలో ముగిసిన నామినేషన్ల దాఖలు
- మొత్తంగా 28 నామినేషన్లు దాఖలైనట్లు అధికారుల ప్రకటన
- భారీ మెజారిటీ సాధించే దిశగా వైసీపీ వ్యూహాలు
- 7 మండలాలకు ఇంచార్జీలుగా ఏడుగురు మంత్రులు
- వారితో సహకారం అందించేందుకు ఏడుగురు ఎమ్మెల్యేలకు బాధ్యతలు
ఈ క్రమంలో ఈ ఎన్నికపై వైసీపీ దృష్టి సారించింది. ఉప ఎన్నికలో లక్ష ఓట్లకు పైగా మెజారిటీని నిర్దేశించుకున్న ఆ పార్టీ... అందుకోసం భారీగా నేతలను రంగంలోకి దింపుతోంది. ఆత్మకూరు అసెంబ్లీ పరిధిలో 7 మండలాలు ఉండగా... ఒక్కో మండలానికి ఒక్కో మంత్రిని ఇంచార్జీగా నియమించింది. మంత్రికి సహకారం అందించేందుకు ఒక్కో నియోజక వర్గానికి ఒక్కో ఎమ్మెల్యేను కూడా ఆ పార్టీ బరిలోకి దించుతోంది. మొత్తంగా భారీ సంఖ్యలో నేతలను దించి అనుకున్న మెజారిటీ సాధించే దిశగా వైసీపీ పావులు కదుపుతోంది.