అనంతబాబు రిమాండ్ పొడిగింపు, బెయిల్పై రేపు విచారణ
- సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా అనంతబాబు
- సోమవారం రాజమహేంద్రవరం కోర్టుకు ఎమ్మెల్సీ
- ఈ నెల 20 వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు నిర్ణయం
సుబ్రహ్మణ్యాన్ని తానే చంపినట్లు వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న అనంతబాబు ఒప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేయగా...ఆయనను జ్యూడిషియల్ రిమాండ్కు తరలిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ రిమాండ్ గడువు ముగియడంతో సోమవారం అనంతబాబును పోలీసులు కోర్టులో హాజరు పరచగా... ఈ నెల 20 వరకు ఆయనకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో అనంతబాబును పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.