Girls: తమిళనాడులో విషాదం... నదిలో మునిగిపోయి ఏడుగురు అమ్మాయిల మృతి

  • కడలూరు వద్ద నదిలో స్నానానికి దిగిన అమ్మాయిలు
  • నదిలో పెరిగిన నీటి ప్రవాహం
  • బయటికి రాలేకపోయిన అమ్మాయిలు
Seven girls drowned to death in Tamilnadu

తమిళనాడులోని కడలూరులో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి కెడిలం నదిలో మునిగిపోయి ఏడుగురు అమ్మాయిలు దుర్మరణం పాలయ్యారు. పరిసర గ్రామాలకు చెందిన అమ్మాయిలు ఈ మధ్యాహ్నం నదిలో స్నానానికి వచ్చారు. వారు నీటిలో దిగిన కొంతసేపటికి నీటి ప్రవాహం పెరిగింది. దాంతో ఆ అమ్మాయిల్లో కొందరు మునిగిపోయారు. 

అక్కడున్నవారు ఇది గమనించి నదిలో దిగి వారిని బయటికి తీశారు. హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ అమ్మాయిలు మృతి చెందారు. కాగా, మరణించిన అమ్మాయిలు సంఘవి (16), సుముత (18), నవిత (18), ప్రియదర్శిని (15), మోనిష (18), దివ్యదర్శిని (10), ప్రియ (18)గా గుర్తించారు. వీరంతా కుచ్చిపాలయం, అయంకురింజిపడి గ్రామాలకు చెందినవారు. వారిలో ప్రియదర్శిని, దివ్యదర్శిని అక్కాచెల్లెళ్లు.

  • Loading...

More Telugu News