ఫుట్బాల్ క్రీడాకారుడు ఆకాష్ హత్య తర్వాత రైలులో చెన్నై చెక్కేసిన ప్రధాన నిందితులు!
- విజయవాడలో ఇటీవల దీపక్ ఆకాష్ దారుణ హత్య
- బార్ వద్ద గొడవ తర్వాత అపార్ట్మెంట్కు వెళ్లి హత్య
- నిందితులు గోపీకృష్ణ, మురళీకృష్ణ చెన్నైలో ఉన్నట్టు గుర్తింపు
- ప్రత్యేక బృందాలతో గాలింపు
ఆ సమయంలో ఆకాష్తోపాటు అతడి స్నేహితుడు కూడా ఉన్నాడు. అందరూ కలిసి ఆకాష్పై దాడిచేశారు. గోపీకృష్ణ, మురళీకృష్ణ కత్తులతో ఆకాష్ను పొడిచి చంపేశారు. ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి పరారయ్యారు. గోపీకృష్ణ, మురళీకృష్ణ మాత్రం రైలులో చెన్నైకి పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో వారి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మరోవైపు, ఈ కేసుతో ప్రమేయం ఉన్న మిగతా వారిని కూడా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది.