ఇదో సరికొత్త పిరికిపంద చర్య!... సోనియా, రాహుల్లకు ఈడీ నోటీసులపై కాంగ్రెస్ స్పందన!
- మోదీకి పెంపుడు సంస్థగా ఈడీ
- రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే నోటీసులు
- ఈడీ నోటీసులను తప్పుబట్టిన రణదీప్ సూర్జేవాలా
పలు జాతీయ మీడియా సంస్థలతో మాట్లాడిన సూర్జేవాలా... సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు అందడం ప్రధాని నరేంద్ర మోదీలోని పిరికితనానికి నిదర్శనమని చెప్పారు. ఇదో సరికొత్త పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. మనీ ల్యాండరింగ్ కేసులను దర్యాప్తు చేయాల్సిన ఈడీ.. ప్రధాని మోదీకి పెంపుడు సంస్థగా మారిపోయిందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.