ఒకే ఇంట్లో నాలుగు మృతదేహాలు... చెన్నై శివార్లలో కలకలం

Four dead bodies found in a house in Chennai suburban
  • పోళిచాలూర్ లో ఘటన
  • ఈ ఉదయం నాలుగు శవాలను గుర్తించిన వైనం
  • మృతుల్లో ఇద్దరు పిల్లలు
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
ఒకే ఇంట్లో నాలుగు మృతదేహాలు వెలుగు చూడడం చెన్నై నగర శివార్లలో తీవ్ర కలకలం రేపింది. పోళిచాలూర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఈ మృతదేహాలు ఉన్నట్టు ఈ ఉదయం వెల్లడైంది. వాటిని ఓ పురుషుడు, స్త్రీ, ఇద్దరు పిల్లల శవాలుగా గుర్తించారు. 

ఆ కుటుంబ యజమాని మొదట తన భార్యను చంపి, ఆపై పిల్లలను కడతేర్చి, చివరగా తాను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. వ్యాపారంలో నష్టపోయి, ఆర్థికపరమైన సమస్యలతోనే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబం ఆత్మహత్య నేపథ్యంలో పోళిచాలూర్ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Go Back to Shorts
Dead Bodies
House
Pozhichalur
Chennai
Police

More Telugu News