డబ్బున్నోళ్లను ఇంకాస్త సంపన్నులను చేసే టోర్నీ ఐపీఎల్: డేవిడ్ లాయిడ్
- ఐపీఎల్ పై అభిప్రాయాలు వెల్లడించిన ఇంగ్లండ్ మాజీ ఆటగాడు
- విటాలిటీ బ్లాస్ట్ టీ20 టోర్నీ బెస్ట్ అని కితాబు
- ఐపీఎల్ భారత్ వరకు సరిపోతుందని వ్యాఖ్యలు
- అక్కడ ఆటగాళ్లను దేవుళ్లలా చూస్తారని వెల్లడి
"నాణ్యత గురించి కాదు... టోర్నీ మన్నిక పరంగా ఆలోచిస్తే విటాలిటీ బ్లాస్ట్ టీ20 లీగ్ తర్వాతే ఏదైనా అని చెబుతాను. ఇంగ్లండ్ ప్రేక్షకులను ఇది ఆకర్షిస్తున్న తీరు చూస్తుంటే క్రికెట్ వినోదం పరాకాష్ఠకు నిదర్శనంలా అనిపిస్తోంది. నేను ఐపీఎల్ లో కూడా పనిచేశాను. అక్కడ డబ్బున్నవాళ్లు ఇంకొంచెం డబ్బు పోగేసుకుంటారు. ఐపీఎల్ అనేది భారత ప్రేక్షకుల వరకు సరిపోతుందేమో... ఎందుకంటే అక్కడ క్రికెటర్లను దేవుళ్లుగా చూస్తారు. కానీ అది చాలా దారుణమైన విషయం. అక్కడ ఫలితానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అది నాకు నచ్చలేదు. క్రికెట్ ను వినోదంగానూ, ఓ సరదాగానూ చూడాలని నేను కోరుకుంటాను. అందుకే ఈ విషయంలో విటాలిటీ బ్లాస్ట్ టీ20 టోర్నీ బెస్ట్ అంటాను" అని వివరించారు.