అర్థాంతరంగా ముగిసిన కేసీఆర్ ఢిల్లీ పర్యటన.. చర్చలు, భేటీలు వాయిదా
- ఈ నెల 20న ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేసీఆర్
- నేడు, రేపు జరగాల్సిన చర్చలు, భేటీలు వాయిదా
- తిరిగి ఈ నెల 25న బెంగళూరుకు సీఎం
- దేవెగౌడ, కుమారస్వామితో భేటీ
- చర్చనీయాంశమైన కేసీఆర్ పర్యటన
అయితే, ఏమైందో ఏమో కానీ.. నేడు, రేపు పలువురు ప్రముఖులతో జరగాల్సిన చర్చలు, భేటీలను రద్దు చేసుకుని సీఎం అర్థాంతరంగా హైదరాబాద్ చేరుకున్నారు. కాగా, ఈ నెల 25న కేసీఆర్ బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామిలతో భేటీ అవుతారు. అలాగే, 27న మహారాష్ట్రలోని రాలెగావ్ సిద్ధి వెళ్లి అన్నాహజారేతో భేటీ అవుతారు. అదే రోజు షిరిడీ వెళ్లి సాయిబాబాను దర్శించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.