ఎండలతో ఠారెత్తిపోతున్న కోస్తాంధ్ర.. విలవిల్లాడుతున్న జనం!
- పడమర నుంచి వీస్తున్న పొడిగాలులు
- వేడి గాలులతో నిప్పుల కుంపటిని తలపిస్తున్న వైనం
- శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు వడగాల్పుల ప్రభావం
- ఈ నెలాఖరు వరకు ఇంతేనంటున్న వాతావరణశాఖ
నిన్న కోస్తాలోని నాలుగు మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 24 మండలాల్లో వడగాల్పులు వీచినట్టు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే, తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో 44.44, అనపర్తి, బిక్కవోలులో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెలాఖరు వరకు ఎండల తీవ్రత ఉంటుందని, 28 వరకు వడగాల్పుల ప్రభావం ఉంటుందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.