మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ ఫైనల్ చేరిన నిఖత్ జరీన్
- హైదరాబాద్కు చెందిన నిఖత్ జరీన్
- 52 కిలోల విభాగంలో దూకుడుగా నిఖత్
- సెమీస్లో బ్రెజిల్కు చెందిన కరోలినా అల్మిడా చిత్తు
ఇప్పటిదాకా ఈ టైటిల్ను సాధించిన భారత మహిళా బాక్సర్లలో మేరీ కామ్, సరితా దేవి, జెన్నీ, లేఖ ఉన్నారు. ఈ దఫా ఫైనల్లో విన్నర్గా నిలిస్తే... హైదరాబాద్కు చెందిన నిఖత్ కూడా వీరి సరసన చేరనుంది. బాక్సింగ్లో సత్తా చాటుతున్న నిఖత్... ఇప్పటికే యువ బాక్సింగ్ చాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఆది నుంచి దూకుడుగానే సాగుతున్న జరీన్ ఫైనల్లోనూ సత్తా చాటి టైటిల్ గెలుస్తుందన్న దిశగా క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.