రోడ్డు ప్రమాద బాధితులని సొంత కారులో ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే రేఖా నాయక్
- కడెం నుంచి నిర్మల్ వెళుతున్న ఎమ్మెల్యే
- తర్లపాడ్ వద్ద చెట్టును గుద్దిన ఓ కారు
- కారులోని వారికి తీవ్ర గాయాలు
- వెంటనే తన వాహనం ఆపించిన రేఖా నాయక్
వెంటనే తన వాహనాన్ని ఆపించిన ఎమ్మెల్యే రేఖా కిందికి దిగి పరిస్థితిని సమీక్షించారు. ఆ కారులోని వారు తీవ్ర గాయాలపాలైన విషయాన్ని గుర్తించిన ఆమె వెంటనే తన సిబ్బంది సాయంతో వారిని తన కారులోకి చేర్చారు. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
.