లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసా.. కర్ణాటకలోని ఆలయాల్లో మొదలు
- మైసూరు, మాండ్య, బెల్గావి జిల్లా ఆలయాల్లో అమలు
- ఉదయం 5 నుంచే మోతెక్కిన లౌడ్ స్పీకర్లు
- చట్ట ప్రకారం నడుచుకోవాలన్న శ్రీరామ్ సేన
బెంగళూరు, మాండ్య, బెల్గామ్, ధార్వాడ్, కలబురగి జిల్లాల్లోని ఆలయాల్లో హన్ మాన్ చాలీసా, మంత్ర పఠనం, ఇతర వేద మంత్ర పారాయణాన్ని ఆడియో రూపంలో పెట్టారు. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాదిరే.. సీఎం బస్వరాజ్ బొమ్మై, హోంశాఖ మంత్రి అరంగ జ్ఞానేంద్ర తమ ధైర్యాన్ని ప్రదర్శించాలని ప్రమోద్ ముతాలిక్ కోరారు. యూపీలో అనధికారికంగా నడుస్తున్న లౌడ్ స్పీకర్లను తొలగించడం, అనుమతులు ఉన్న వాటికి నిబంధనల మేరకు శబ్ద పరిమితులు విధించడాన్ని ముతాలిక్ ప్రస్తావించారు.