TTD: తిరుమ‌ల‌లో తొలిసారి హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాలు

  • ఈ నెల 25 నుంచి 4 రోజుల పాటు నిర్వ‌హ‌ణ‌
  • అంజ‌నాద్రి, జాపాలి, నాద నీరాజ‌న వేదిక‌, వేద పాఠ‌శాల‌ల్లో వేడుక‌లు
  • ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన టీటీడీ అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డి
hanumajjayanthi utsavam in tirumala for the first time

క‌లియుగ దైవం శ్రీవేంకటేశ్వ‌ర స్వామి కొలువై ఉన్న తిరుమ‌ల‌లో తొలిసారిగా హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి. తిరుమ‌ల చ‌రిత్ర‌లోనే తొలిసారిగా నిర్వ‌హించ‌నున్న హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాలు ఈ నెల 25 నుంచి 29 వ‌ర‌కు నాలుగు రోజుల పాటు నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు శ‌నివారం టీటీడీ అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డి ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. 

తిరుమ‌ల కొండ‌పై అంజ‌నాద్రి, జాపాలి, నాద నీరాజ‌న వేదిక‌, వేద పాఠ‌శాల‌ల్లో ఈ వేడుక‌లను నిర్వ‌హించనున్న‌ట్లు ధ‌ర్మారెడ్డి తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను ఆయ‌న శ‌నివారం ప‌రిశీలించారు. ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేలా ప‌క‌డ్బందీగా ఏర్పాట్ల‌ను చేయాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు.

More Telugu News