Andhra Pradesh: కాకాణి మీడియా స‌మావేశంలో నిలిచిన విద్యుత్ స‌ర‌ఫ‌రా

  • విద్యుత్ కోత‌ల‌పై వైసీపీ, టీడీపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం
  • స‌చివాల‌యంలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసిన కాకాణి
  • కాకాణి మాట్లాడుతుండ‌గానే నిలిచిన‌ విద్యుత్ స‌ర‌ఫ‌రా
power cut in minister kakani pressmeey in ap secretariat

ఏపీలో విద్యుత్ కోత‌లు పెరిగిపోయాయ‌ని విప‌క్షం టీడీపీ ఆరోపిస్తుండ‌గా... అలాంటిదేమీ లేద‌ని వైసీపీ ప్ర‌భుత్వం చెబుతున్న విష‌యం తెలిసిందే. వేస‌వి నేపథ్యంలో విద్యుత్ వినియోగం పెరిగింద‌ని,  ఆ మేర‌కు విద్యుత్ అందుబాటులో లేని కార‌ణంగానే స్వ‌ల్పంగా విద్యుత్ కోత‌లు విధించ‌క త‌ప్ప‌డం లేద‌ని జ‌గ‌న్ స‌ర్కారు చెబుతున్న సంగ‌తి తెలిసిందే. 

ఈ నేప‌థ్యంలో బుధ‌వారం నాడు అమ‌రావ‌తిలోని స‌చివాలయంలో ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఐక్య‌రాజ్య‌స‌మితి నేతృత్వంలోని ఫుడ్ అండ్ అగ్రిక‌ల్చ‌ర్ ఆర్గ‌నైజేష‌న్ (ఎఫ్ఏఓ) అవార్డుకు ఆర్బీకేలు నామినేట్ అయిన విష‌యాన్ని వెల్ల‌డించేందుకు బుధ‌వారం వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి స‌చివాల‌యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో మంత్రి ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలోనే విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. ఆ త‌ర్వాత కాసేప‌టికే విద్యుత్ స‌ర‌ఫ‌రా పున‌రుద్ధ‌ర‌ణ కావ‌డంతో కాకాణి త‌న స‌మావేశాన్ని కొన‌సాగించారు.

More Telugu News