రమ్య హత్య కేసు నిందితుడికి ఉరిశిక్షపై స్పందించిన ఏపీ హోం మంత్రి
- తీర్పు చరిత్రాత్మకమైనది
- ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో ఈ తరహా కేసుల విచారణలో వేగం
- ఈ తీర్పు స్ఫూర్తితో మహిళలపై నేరాల్లో విచారణ
- మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తామన్న వనిత
రమ్య హంతకుడికి ఉరి శిక్ష విధిస్తూ గుంటూరు ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పిన హోం మంత్రి... దిశ చట్టం స్ఫూర్తితోనే ఈ కేసు దర్యాప్తు సాగిందని చెప్పారు. ఈ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు స్ఫూర్తితో రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాలపై త్వరితగతిన విచారణ ఉంటుందని ఆమె చెప్పారు. మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తానేటి వనిత తెలిపారు.