లోన్ యాప్లపై ఈడీ నజర్... రూ.6.17 కోట్ల ఆస్తుల సీజ్
- ఫిన్ టెక్ కంపెనీకి చెందిన ఆస్తుల ఆటాచ్
- మనీ లాండరింగ్ కింద కేసు నమోదు
- పలు కంపెనీలకు చెందిన ఆస్తుల సీజ్
తాజాగా ఆన్లైన్ లోన్ యాప్లపై పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఈడీ.. బుధవారం నాడు ఓ కీలక చర్యకు ఉపక్రమించింది. లోన్ యాప్ సంస్థ ఫిన్టెక్కు చెందిన రూ.6.17 కోట్ల విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసింది. అంతేకాకుండా పలు లోన్ యాప్లకు చెందిన ఆస్తులను కూడా అటాచ్ చేస్తూ ఈడీ చర్యలు తీసుకుంది.