Corona Virus: దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌

  • కొత్త‌గా 2,593 క‌రోనా కేసులు
  • యాక్టివ్ కేసులు 15,873 
  • నిన్న 44 మంది మృతి
  • మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 5,22,193
corona bulletin in inida

దేశంలో కొత్త‌గా 2,593 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 15,873 మంది చికిత్స తీసుకుంటున్నార‌ని వివ‌రించింది. నిన్న క‌రోనా నుంచి 1,755 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,25,19,479 గా ఉందని తెలిపింది. 

క‌రోనా వ‌ల్ల నిన్న 44 మంది ప్రాణాలు కోల్పోయార‌ని, దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 5,22,193గా ఉంద‌ని పేర్కొంది. నిన్న దేశంలో 19,05,374 డోసుల వ్యాక్సిన్లు వేసిన‌ట్లు తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 187,67,20,318 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.

More Telugu News