KCR: 29న ముస్లిం సోద‌రుల‌కు సీఎం కేసీఆర్ ఇఫ్తార్ విందు

  • ఎల్బీ స్టేడియంలో సీఎం ఇఫ్తార్ విందు
  • మైనారిటీల అభివృద్ధి కోసం పథకాల అమలు
  • లౌకిక వాదాన్ని కాపాడటంలో తెలంగాణ దేశానికే ఆద‌ర్శ‌మ‌న్న‌కేసీఆర్‌
kcr will give iftar to muslims on 29th of this month

రంజాన్ మాసాన్ని పుర‌స్క‌రించుకుని ముస్లిం సోద‌రుల‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 29న ఇఫ్తార్ విందు ఇవ్వ‌నున్నారు. ఈనెల 29న సాయంత్రం 6:10 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఇవ్వ‌నున్న ఇఫ్తార్ విందుకు ముస్లిం మత పెద్దలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, హాజ‌ర‌వుతార‌ని శ‌నివారం సాయంత్రం కేసీఆర్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌లో మ‌త సామ‌రస్యం ఫ‌రిడ‌విల్లుతున్న వైనాన్ని కేసీఆర్ ప్ర‌స్తావించారు.  "తెలంగాణ రాష్ట్రం నేడు మత సామరస్యానికి, గంగా జమున తహజీబ్ కు వేదికగా నిలిచింది. సర్వ మతాల సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తున్నది. ముస్లిం మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం పలు పథకాలను అమలుపరుస్తున్నది. లౌకికవాదాన్ని కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది" అని కేసీఆర్ ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

More Telugu News