Andhra Pradesh: ఏపీలో తాజాగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు

Only four corona positive cases in AP
  • గత 24 గంటల్లో 3,030 కరోనా పరీక్షలు
  • నాలుగు జిల్లాల్లో ఒక్కొక్క కేసు
  • కరోనా నుంచి కోలుకున్న ఆరుగురు
  • తాజా మరణాలు నిల్
ఏపీలో గడచిన 24 గంటల్లో 3,030 కరోనా పరీక్షలు నిర్వహించగా, కేవలం 4 పాజిటివ్ కేసులు మాత్రమే వెల్లడయ్యాయి. కాకినాడ జిల్లాలో 1, ఎన్టీఆర్ జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 1, విశాఖ జిల్లాలో 1 కేసు గుర్తించారు. అదే సమయంలో ఆరుగురు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఇప్పటిదాకా ఏపీలో కరోనాతో 14,730 మంది మృతి చెందారు.
Andhra Pradesh
Corona Virus
Positive Cases
Daily Update

More Telugu News