మెడికల్ కాలేజీ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్... 50 మంది విద్యార్థినులకు అస్వస్థత
- అమలాపురం పరిధిలోని కిమ్స్ నర్సింగ్ కాలేజీలో ఘటన
- బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు అస్వస్థత
- ఫుడ్ పాయిజనింగే కారణమని నిర్ధారణ
- బాధితులకు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స
వారు తిన్న ఆహారం విషపూరితమైందని గుర్తించారు. ఈ ఘటనలో 50 మంది దాకా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ హుటాహుటీన కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకేసారి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో కాలేజీ యాజమాన్యం ఆందోళనకు గురైంది. ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ చేసింది.