Boris Johnson: భార‌త్ చేరుకున్న బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్

  • లండన్‌ నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌కు జాన్స‌న్
  • స్వాగతం చెప్పిన గుజ‌రాత్ సీఎం భూపేంద్ర పటేల్ 
  • భారత్‌లో తొలిసారి ప‌ర్య‌టిస్తోన్న‌ బోరిస్‌ జాన్సన్
boris reached india

బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్ లండన్‌ నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌ చేరుకున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆయనకు ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్ తో పాటు ప‌లువురు అధికారులు స్వాగతం పలికారు. తొలిసారి భారత్ కు వచ్చిన బోరిస్ జాన్స‌న్ ఇక్కడ రెండు రోజుల పాటు ప‌ర్య‌టిస్తారు. 

పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో ఆయ‌న స‌మావేశం అవుతారు. ఇరు దేశాల మ‌ధ్య‌ సంబంధాలపై ఆయ‌న భార‌త ప్ర‌భుత్వంతో చర్చిస్తారు. పెట్టుబడులతో పాటు ఉద్యోగాల కల్పనపై, ప‌లు అంశాల్లో కలిసి పనిచేయడంపై చ‌ర్చ‌లు జ‌రుపుతారు. కాగా, బోరిస్ జాన్స‌న్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అహ్మ‌దాబాద్‌లో ఆయ‌న‌కు సంబంధించిన క‌టౌట్లు ఏర్పాటు చేశారు. 

కాసేప‌ట్లో ఆయ‌న‌ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో ఆయ‌న స‌మావేశం అవుతారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నేప‌థ్యంలో బోరిస్ జాన్సన్‌ భారత్ లో పర్యటిస్తుండ‌డంతో ఆయ‌న ప‌ర్య‌టన‌ మ‌రింత‌ ప్రాధాన్యత సంతరించుకుంది.  

More Telugu News