Kamaal R Khan: తాను తీయబోయే సినిమా బాహుబలిని మించి ఉంటుందన్న బాలీవుడ్ విమర్శకుడు

  • మరోసారి వార్తల్లోకెక్కిన కమాల్ ఆర్ ఖాన్
  • గతంలో దేశ్ ద్రోహి చిత్రం తీసిన వైనం
  • ఇప్పుడు దానికి సీక్వెల్ తీస్తానని వెల్లడి
  • బ్లాక్ బస్టర్ ఎలా తీయాలో బాలీవుడ్ కు చూపిస్తానని వ్యాఖ్యలు
Kamaal R Khan announced his next movie

బాలీవుడ్ విమర్శకుడు, నటుడు కమాల్ ఆర్ ఖాన్ మరోసారి వార్తల్లోకెక్కారు. గతంలో వలసదారుల సమస్యపై ఆయన 'దేశ్ ద్రోహి' చిత్రం తెరకెక్కించాడు. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ తీస్తానని చెబుతున్నాడు. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి తానేనని, దర్శకత్వం కూడా తానే వహిస్తానని వెల్లడించాడు. 

బ్లాక్ బస్టర్ సినిమా ఎలా తీయాలో దేశ్ ద్రోహి-2 చిత్రం ద్వారా బాలీవుడ్ కు మార్గదర్శనం చేస్తానని పేర్కొన్నాడు. తన కొత్త చిత్రం బాహుబలిని మించి ఉంటుందని చెప్పాడు. త్వరలోనే ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుందని కమాల్ ఆర్ ఖాన్ వెల్లడించాడు. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా పంచుకున్నాడు.

More Telugu News