KKR: రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్... టాస్ గెలిచిన కోల్ కతా

  • ముంబయి బ్రాబౌర్న్ స్టేడియంలో మ్యాచ్
  • బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా
  • కోల్ కతా జట్టులో ఒక మార్పు
  • అమన్ ఖాన్ స్థానంలో శివం మావి
  • రాజస్థాన్ జట్టులో మూడు మార్పులు
KKR won the toss

ఐపీఎల్ లో నేడు కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కు ముంబయిలోని బ్రాబౌర్న్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ బౌలింగ్ ఎంచుకుంది. టోర్నీలో ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ 5 మ్యాచ్ లు ఆడి 3 విజయాలు సాధించింది. కోల్ కతా జట్టు 6 మ్యాచ్ లు ఆడి 3 విజయాలు నమోదు చేసింది. 

ఇవాళ్టి మ్యాచ్ కోసం కోల్ కతా జట్టులో ఒక మార్పు చేశారు. అమన్ హకీం ఖాన్ స్థానంలో శివం మావి జట్టులోకి వచ్చాడు. అటు, రాజస్థాన్ జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి. వాన్ డెర్ డుసెన్, కుల్దీప్, నీషామ్ స్థానంలో కరుణ్ నాయర్, ఒబెద్ మెక్ కాయ్, ట్రెంట్ బౌల్ట్ జట్టులోకి వచ్చారు.

కోల్ కతా నైట్ రైడర్స్...
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, ఆరోన్ ఫించ్, నితీశ్ రాణా, ఆండ్రీ రస్సెల్, షెల్డన్ జాక్సన్, సునీల్ నరైన్, పాట్ కమిన్స్, శివం మావి, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.


రాజస్థాన్ రాయల్స్... 
సంజు శాంసన్(కెప్టెన్), జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, కరుణ్ నాయర్, షిమ్రోన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెద్ మెక్ కాయ్, యజువేంద్ర చహల్.

More Telugu News