Narendra Modi: రేపు ఎర్రకోట వేదికగా జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

  • తేగ్ బహదూర్ జయంతి సందర్భంగా కార్యక్రమం
  • కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం
  • ముఖ్యమంత్రులు, దేశ విదేశాల ప్రముఖుల హాజరు
  • పోస్టల్ స్టాంపు విడుదల చేయనున్న మోదీ
PM Narendra Modi will address the nation from Red Fort tomorrow

సిక్కుల గురువు తేగ్ బహదూర్ జయంతిని పురస్కరించుకుని రేపు ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అంతేకాదు, గురు తేగ్ బహుదూర్ జ్ఞాపకార్థం ఓ పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేయనున్నారు. 

సాధారణంగా భారత ప్రధాని ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాత్రమే ఎర్రకోట నుంచి ప్రసంగించడం ఆనవాయతీ. అయితే, గురు తేగ్ బహదూర్ జయంతిని పురస్కరించుకుని ఆయన ఎర్రకోట నుంచి ప్రసంగించాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రులు, దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు.

More Telugu News