Kinjarapu Ram Mohan Naidu: శ్రీకాకుళం యాసతో సినిమాలు రూపొందించడం చూసి గర్విస్తున్నా: ఎంపీ రామ్మోహన్ నాయుడు

  • సుమ ప్రధాన పాత్రలో జయమ్మ పంచాయితీ
  • ఉత్తరాంధ్ర నేటివిటీ నేపథ్యంలో చిత్రం
  • పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్
  • ట్రైలర్ చాలా బాగుందన్న రామ్మోహన్ నాయుడు
Ram Mohan Naidu opines on Jayamma Panchayathi

ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న చిత్రం జయమ్మ పంచాయితీ. పూర్తిగా ఉత్తరాంధ్ర యాసలో ఈ చిత్రం ఉంటుందని ట్రైలర్ ద్వారా వెల్లడైంది. దీనిపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించారు. శ్రీకాకుళం యాసలో సినిమాలు తీస్తుండడం చూస్తుంటే గర్వంగా ఉందని పేర్కొన్నారు. 

ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుందని కితాబిచ్చారు. ఇలాంటి సినిమాలు ఇంకెన్నో రావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. మన భాష, సంస్కృతిని ప్రతిబింబించేలా చిత్రాలు ఉండాలని సూచించారు. జయమ్మ పంచాయితీ చిత్రం మే 6న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విడుదల చేశారు.

More Telugu News