మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి నెల్లూరులో ఘనస్వాగతం

నెల్లూరు రాజకీయాల్లో ఇవాళ అందరి దృష్టి మాజీ మంత్రి అనిల్ కుమార్ సభ, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి  బైక్ ర్యాలీపైనే కేంద్రీకృతమై ఉంది. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో అనిల్ సభ ఎలాంటి వివాదాలకు తావులేకుండా జరగ్గా, అటు, మంత్రి అయిన తర్వాత కాకాణి తొలిసారిగా నెల్లూరు విచ్చేశారు. కావలి నుంచి ఆయన ర్యాలీ నెల్లూరుకు చేరుకోగానే పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. 

ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఆర్యవైశ్య నేతలు, వైసీపీ శ్రేణులు కాకాణికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాకాణి ఆత్మకూరు బస్టాండు వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత నెల్లూరు వైసీపీ కార్యాలయానికి ఊరేగింపుగా తరలి వెళ్లారు. 

అంతకుముందు, అమరావతి నుంచి కావలి విచ్చేసిన ఆయనకు పట్టణ శివార్లలో స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కార్యకర్తలు స్వాగతం పలికారు. పూలవర్షం కురిపిస్తూ కావలి పట్టణంలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కాకాణి... ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అనంతరం నెల్లూరు పయనమయ్యారు.

Kakani Govardhan Reddy
Nellore
Minister
YSRCP

More Telugu News