ఏకంగా కోర్టుల్లోనే చోరీలు చేస్తూ ఆధారాలు మాయం చేస్తున్నారు: నారా లోకేశ్
- నాడు కాకాణిపై సోమిరెడ్డి కేసు
- ఆ కేసుకు సంబంధించిన పత్రాలే తాజాగా చోరీ
- పత్రాలు, ల్యాప్ టాప్ ఎత్తుకెళ్లిన దొంగలు
- మంత్రిపదవి పోతుందని భయపడ్డారన్న లోకేశ్
కాకాణిపై నకిలీ పత్రాల కేసును విత్ డ్రా చేయించాలని చూశారని, ఇప్పుడు కేసు విచారణ ప్రారంభమైతే మంత్రి పదవి పోతుందని భయపడ్డారని లోకేశ్ ఆరోపించారు. కీలక పత్రాలు, ల్యాప్ టాప్ ను ఎత్తుకెళ్లిన దొంగలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.