ఆకాశంలో అరుదైన దృశ్యం.. ఒకే రేఖపైకి నాలుగు గ్రహాలు
- సాధారణంగా పక్కపక్కనే శుక్రుడు, అంగారకుడు
- వీటి వరుసలోకి బృహస్పతి, శని
- ఏప్రిల్ చివరికి ఒకే వరుసలోకి
- రెండేళ్ల తర్వాత మరో విడత దర్శనం
ఏప్రిల్ మధ్య నాటికి శుక్రుడు, అంగారకుడు సరసన బృహస్పతి వచ్చి చేరనుంది. ఏప్రిల్ చివరికి ఈ మూడింటి వరుసలోకి శని రానున్నాడు. జెట్ ప్రపోల్షన్ ల్యాబొరేటరీ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ఇవి మన కంటికి చూడ్డానికి దగ్గరకు వచ్చినట్టు అనిపించినా. అంత దగ్గరగా ఉండవు. బిలియన్ల కిలోమీటర్ల దూరం వీటి మధ్య ఉంటుంది. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే క్రమంలో వీటి అలైన్ మెంట్ లో వచ్చే మార్పులతో ఇలాంటి విశేషాలు ఏర్పడుతుంటాయి.