Andhra Pradesh: ప్రమాణస్వీకారాల తర్వాత పాత, కొత్త మంత్రులకు జగన్ టీ పార్టీ.. రెడీ అయిన పాసులు!

  • ఈ నెల 11న కొత్త మంత్రుల ప్రమాణం
  • ఆ తర్వాత టీ పార్టీ ఇవ్వనున్న సీఎం
  • ఐదు కేటగిరీలుగా ఆహ్వానితుల విభజన
Jagan to give tea party to new and old ministers

ఏప్రిల్ 11న ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువుతీరనుంది. ప్రమాణ స్వీకారం అనంతరం తేనీటి విందు కార్యక్రమం ఉంటుంది. నూతన మంత్రుల ప్రమాణస్వీకారానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఛైర్మన్లు, అధికారులకు ఆహ్వానాలు పంపారు. ఈ కార్యక్రమానికి వచ్చే ఆహ్వానితులను ఏఏ, ఏ1, ఏ2, బీ1, బీ2 కేటగిరీలుగా విభజించి, పాసులు జారీ చేశారు. ఒక్కో పాసు ద్వారా ఒక్కరికి మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి 35 నిమిషాల ముందే సీట్లలో ఆసీనులు కావాలని సూచించారు. 

More Telugu News