కొత్త జిల్లాలను ప్రారంభించిన జగన్.. ప్రారంభమైన కార్యకలాపాలు!

  • వర్చువల్ గా కొత్త జిల్లాలను ప్రారంభించిన జగన్
  • రాష్ట్రంలో ఇకపై 23 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు
  • ఏపీలో 42 ఏళ్ల తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నంచి వర్చువల్ గా కొత్త జిల్లాలను సీఎం ప్రారంభించారు. దీంతో ఇప్పటి వరకు ఉన్న 13 జిల్లాలు కాస్తా 26 జిల్లాలుగా ఏర్పడ్డాయి. లోక్ సభ నియోజకవర్గం ప్రామాణికంగా జిల్లాలను ఏర్పాటు చేశారు. 

ఈ క్రమంలో ఇకపై రాష్ట్రంలో 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లలో కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఏపీలో 42 ఏళ్ల తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. ఈ ఉదయం 9.05 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లు బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఇతర శాఖల జిల్లా అధికారులు బాధ్యతలను చేపట్టారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

Andhra Pradesh
New Districts
Jagan
YSRCP

More Telugu News