బ్రహ్మోస్ ఉపరితల క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
- అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రయోగం
- పూర్తి కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిన క్షిపణి
- దీవుల్లో బలగాల కార్యాచరణ సంసిద్ధతలను సమీక్షించిన ఎయిర్ చీఫ్ మార్షల్
బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించిన వార్తలు ఇటీవల ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. కమాండ్ ఎయిర్స్టాప్ ఇన్స్పెక్షన్ (సీఏఎస్ఐ) సమయంలో భారత వాయుసేన యూనిట్ నుంచి సాంకేతిక లోపం కారణంగా మిస్ఫైర్ అయి పాకిస్థాన్ భూభాగంలోకి దూసుకుపోయి కలకలం రేపింది. అయితే, నిరాయుధ క్షిపణి అయిన దీని వల్ల స్వల్ప నష్టం మాత్రమే జరగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై భారత్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ పాకిస్థాన్కు లేఖ రాసింది. అణ్వాయుధాలను మోసుకెళ్లగల బ్రహ్మోస్ క్షిపణిని నింగి, నేల, ఉపరితలం నుంచి కూడా ప్రయోగించవచ్చు.