కొత్త చిక్కుల్లో సల్మాన్ ఖాన్.. సమన్లు జారీ చేసిన కోర్టు!
- 2019లో జర్నలిస్టుపై దాడి
- సల్మాన్, ఆయన బాడీగార్డుపై కేసు
- ఏప్రిల్ 5కి విచారణను వాయిదా వేసిన కోర్టు
కృష్ణ జింకలను చంపిన కేసు సల్మాన్ ను ఎప్పటి నుంచో వెంటాడుతూనే ఉంది. తాజాగా ఒక జర్నలిస్టుపై దాడి చేసిన కేసు ఇప్పుడు తెరపైకి వచ్చింది. 2019లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి బాధిత జర్నలిస్టు అశోక్ పాండే చేసిన ఫిర్యాదు మేరకు... సల్మాన్ ఖాన్, ఆయన బాడీ గార్డ్ నవాజ్ షేక్ లకు అంధేరీ కోర్టు సమన్లు జారీ చేసింది. వీరిద్దరిపై ఐపీసీ సెక్షన్లు 504, 506 కింద కేసులు పోలీసులు కేసు నమోదు చేసినట్టు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్ఆర్ ఖాన్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమన్లు జారీ చేసిన న్యాయస్థానం తదుపరి విచారణను ఏప్రిల్ 5కి వాయిదా వేసింది.