ఎన్నికలు వచ్చే నాటికి ఈ సినిమాను ప్రజలు మర్చిపోతారు: సంజయ్ రౌత్
- దేశ వ్యాప్తంగా ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు ఆదరణ
- కశ్మీర్ లాంటి సున్నితమైన అంశంపై రాజకీయాలు చేయడం సరికాదన్న రౌత్
- వచ్చే ఎన్నికల్లో ఏ ఒక్కరికీ రాజకీయ ప్రయోజనం చేకూరదని వ్యాఖ్య
‘ది కశ్మీర్ ఫైల్స్’ కేవలం సినిమా మాత్రమేనని అన్నారు. దీని వల్ల వచ్చే ఎన్నికల్లో ఏ ఒక్కరికీ రాజకీయ ప్రయోజనం చేకూరుతుందని తాను అనుకోవట్లేదని తెలిపారు. ఎన్నికల నాటికి ఈ సినిమాను ప్రజలు మర్చిపోతారని చెప్పారు. కాగా, ఈ సినిమాపై కొందరు నేతలు ప్రశంసలు కురిపిస్తుండగా, ఇందులో అసత్యాలు చూపించారంటూ మరికొందరు విమర్శలు చేస్తున్నారు.