'జాబులెక్కడ జగన్ రెడ్డి?' అంటూ టీడీపీ నిరసన

Where Are Jobs TDP Questioned CM Jagan
  • 2.3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్
  • ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను నింపాలని నిరసన
  • లోకేశ్ సహా శాసనసభా పక్ష నేతల ఆందోళన
ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ శాసనసభా పక్ష నేతలు నిరసన తెలియజేశారు. హామీ ఇచ్చినట్టుగా ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం హామీ ఇచ్చినట్టు భర్తీ చేస్తామన్న 2.30 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జాబులు ఎక్కడ జగన్ రెడ్డి? అంటూ బ్యానర్ ను ప్రదర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో నారా లోకేశ్, కింజారపు అచ్చెన్నాయుడు, అశోక్ బాబు తదితర నేతలు పాల్గొన్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
Nara Lokesh
Kinjarapu Acchamnaidu

More Telugu News