పెళ్లిలో భోజనం చేసిన 1200 మంది ఆసుపత్రి పాలు!
- గుజరాత్లోని మెహసనా జిల్లాలో ఘటన
- ఆహారం తీసుకున్న తర్వాత వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు
- ఆహార నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిన పోలీసులు
పెళ్లిలో ఏర్పాటు చేసిన విందు తీసుకున్న తర్వాత చాలామంది వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలతో బాధపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. విందులో ఏర్పాటు చేసిన ఆహార నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్టు పోలీసులు తెలిపారు. ఫుడ్ అండ్ డ్రగ్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. విందులో అతిథులకు వడ్డించిన ఆహార పదార్థాల్లో మాంసాహారం కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.