అనారోగ్యంతో ఉక్రెయిన్లో మరో భారత విద్యార్థి మృతి
- విన్నీసియాలో మెడిసిన్ చదువుతున్న చందన్ జిందాల్
- ఈ పంజాబ్ విద్యార్థికి ఇటీవలే అనారోగ్యం
- ఆసుపత్రిలో చేర్పించగా.. బ్రెయిన్ స్ట్రోక్తో మృతి
యుద్ధ సమయంలో మృతి చెందిన రెండో భారత విద్యార్థి పంజాబ్కు చెందిన వాడని, అతడి పేరు చందన్ జిందాల్ (22) అని జాతీయ మీడియా పేర్కొంది. ఉక్రెయిన్లోని విన్నీసియా నగరానికి చెందిన మెమోరియల్ మెడికల్ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న జిందాల్ కొద్దిరోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడట. దీంతో అతడిని స్థానిక ఆసుపత్రిలో చేర్చగా.. బుధవారం నాడు బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా అతడు మరణించాడు.