ఏపీలో మరో 220 మందికి కరోనా పాజిటివ్

AP Corona Bulletin
  • గత 24 గంటల్లో 17,735 కరోనా పరీక్షలు
  • పశ్చిమ గోదావరి జిల్లాలో 43 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 4,927 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల వ్యవధిలో కరోనా వ్యాప్తికి సంబంధించి తాజా బులెటిన్ విడుదలైంది. కొత్తగా 17,735 కరోనా పరీక్షలు నిర్వహించగా, 220 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 43, కృష్ణా జిల్లాలో 40, గుంటూరు జిల్లాలో 36, తూర్పు గోదావరి జిల్లాలో 27 కొత్త కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 472 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,17,184 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 22,97,537 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,927 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 14,720కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Bulletin
Daily Cases
Today Cases

More Telugu News