ఉక్రెయిన్లోని ఏపీ విద్యార్థుల కోసం కేంద్రానికి జగన్ లేఖ
- రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధ మేఘాలు
- భారతీయులు దేశానికి రావాలంటూ ఇప్పటికే కేంద్రం పిలుపు
- ఏపీ విద్యార్థులను సురక్షితంగా తీసుకురావాలంటూ సీఎం విజ్ఞప్తి
ఉక్రెయిన్లో ఉంటున్న ఏపీ విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావాలని సదరు లేఖలో జగన్ విదేశీ వ్యవహారాల మంత్రిని కోరారు. ఈ విషయంలో ఏపీ నుంచి ఎలాంటి సహకారం అందించడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని కూడా జగన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్లోని ఏపీ విద్యార్థులను తక్షణమే సురక్షితంగా వారి స్వస్థలాలకు చేర్చాలని జగన్ కోరారు.