హిజాబ్ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం

Karnata High court commets on hijab
విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించడంపై దాఖలైన పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈరోజు విచారించింది. ఈ వివాదం పెండింగులో ఉన్నంత కాలం విద్యార్థులు మతపరమైన దుస్తులు ధరించరాదని ఆదేశించింది. విద్యాసంస్థలను తెరుచుకోవచ్చని తెలిపింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్ ను విచారించేందుకు చీఫ్ జస్టిస్ రితు రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ట ఎస్ దీక్షిత్, జస్టిస్ జైబున్నీసా ఎం ఖాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనాన్ని నిన్న హైకోర్టు ఏర్పాటు చేసింది.
Go Back to Shorts
Karnataka
Hijab
High Court

More Telugu News