కాపులకు ఊరట... తుని ఘటనలో నమోదైన కేసుల ఎత్తివేత
- 2016లో ఉద్ధృతంగా కాపు ఉద్యమం
- ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో పోరుబాట
- తునిలో భారీ బహిరంగ సభ
- రైలుకు నిప్పంటించిన ఆందోళనకారులు
ఈ నేపథ్యంలో కాపులకు ఊరట కల్పించేలా తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైలును దగ్ధం చేసిన ఘటనలో కాపులపై నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ప్రత్యేక జీవో జారీ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కాపులపై నమోదైన కేసులు తొలగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.