కామన్వెల్త్ క్రీడల్లో మరోసారి క్రికెట్ కు చోటు

Cricket gets place in Birmingham Commonwealth Games this year
  • ఈ ఏడాది ఇంగ్లండ్ లో కామన్వెల్త్ క్రీడలు
  • మహిళల క్రికెట్ జట్లతో పోటీలు
  • టీ20 ఫార్మాట్లో పోటీలు
  • ఒకే గ్రూప్ లో దాయాదులు
  • తొలిమ్యాచ్ లో ఆసీస్ తో టీమిండియా ఢీ
అనేక దేశాల్లో జనరంజక క్రీడగా కొనసాగుతున్న క్రికెట్ కు కామన్వెల్త్ క్రీడల్లో మరోసారి స్థానం దక్కింది. ఈ ఏడాది ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ వేదికగా జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ కు కూడా చోటు కల్పించారని ఐసీసీ వెల్లడించింది. మలేసియాలో 1998లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ కు తొలిసారి స్థానం కల్పించారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ కూడా అలరించనుంది.

అయితే ఈ పర్యాయం కేవలం మహిళల జట్లే బరిలో దిగుతాయని ఐసీసీ పేర్కొంది. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో రెండు గ్రూప్ లు ఉన్నాయి. గ్రూప్-ఏలో టీమిండియా, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, బార్బడోస్ జట్లున్నాయి. గ్రూప్-బిలో శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లున్నాయి. జులై 29న జరిగే తొలి మ్యాచ్ లో టీమిండియా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ పోటీలు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో నిర్వహించనున్నారు.
Go Back to Shorts
Cricket
Commonwealth Games
Birmingham
England
ICC

More Telugu News