Telangana: తెలంగాణలో మరో 2,850 మందికి కరోనా... పూర్తి వివరాలు ఇవిగో!

Telangana corona update
  • తాజా బులెటిన్ విడుదల
  • గత 24 గంటల్లో 94,020 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 859 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 35,625 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 94,020 కరోనా పరీక్షలు నిర్వహించగా... 2,850 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 859 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 173, రంగారెడ్డి జిల్లాలో 157, సిద్ధిపేట జిల్లాలో 101 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 4,391 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,66,761 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,27,045 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 35,625 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,091కి పెరిగింది.
Telangana
Update
Corona Virus
Today Cases

More Telugu News