ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే నేతాజీ ప్రతిరూపాలై పోరాడాలి: చంద్రబాబు

Chandrababu pays tributes to Netaji Subhash Chandrabose
  • నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి
  • నివాళులు అర్పించిన చంద్రబాబు
  • అన్యాయం జరుగుతుంటే ప్రతిఘటించాలని పిలుపు
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. అన్యాయంతో రాజీపడడం అంటే మనం అతిపెద్ద నేరం చేసినట్టేనని నేతాజీ అన్నారని వెల్లడించారు. ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే మనం ఎందుకు ఊరుకోవాలి? నేతాజీ ప్రతిరూపాలై ఆ అన్యాయంపై పోరాడాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

తన అభ్యుదయ భావాలతో యువతరానికి చిరస్మరణీయ స్ఫూర్తిని అందించిన స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కీర్తించారు. ఈ ఏడాది సుభాష్ చంద్రబోస్ జయంతి రోజైన జనవరి 23 నుంచే దేశ గణతంత్ర దినోత్సవాలు జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించడం హర్షణీయమని చంద్రబాబు పేర్కొన్నారు.
Go Back to Shorts
Chandrababu
Netaji Subhash Chandrabose
Birth Anniversary
Tributes

More Telugu News