చికిత్స కోసం అమెరికా వెళ్లిన కేరళ సీఎం... అక్కడి నుంచే పాలన!
- అమెరికాలో రెండు వారాలు గడపనున్న విజయన్
- 2018లో మిన్నెసోటాలో చికిత్స
- తదుపరి చికిత్స కోసం అమెరికా పయనం
- ఈ నెల 29న తిరిగిరాక
ఈ నేపథ్యంలో సీఎం పినరయి విజయన్ ఆసక్తికర ప్రకటన చేశారు. తాను రాష్ట్రంలో లేనప్పటికీ ఎవరికీ బాధ్యతలు అప్పగించబోవడంలేదని స్పష్టం చేశారు. అమెరికా నుంచే పరిపాలిస్తానని, అందుకోసం టెక్నాలజీ ఉపయోగిస్తానని వెల్లడించారు. ఆసుపత్రిలో బెడ్ పై ఉన్నాగానీ పరిపాలన కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
గతంలో అమెరికా వెళ్లినప్పుడు ఈపీ జయరాజన్ కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ఈసారి మాత్రం విదేశీ గడ్డపై నుంచే పాలన కొనసాగించాలని పినరయి విజయన్ నిర్ణయించుకున్నారు. కాగా, విజయన్ ఈ నెల 29న అమెరికా నుంచి భారత్ తిరిగి రానున్నారు.