Corona Virus: ఏపీలో మరో 840 కరోనా కేసుల నమోదు

Corona cases in AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా వ్యాప్తి మళ్లీ పుంజుకుంది. గత కొన్నిరోజులుగా 500కి పైబడి కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 37,849 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 840 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 183 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 150 కేసులను గుర్తించారు. అదే సమయంలో 133 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 20,79,763 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,62,290 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,972 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,501కి పెరిగింది.
Go Back to Shorts
Corona Virus
Positive Cases
Today Cases
Andhra Pradesh

More Telugu News