CM Jagan: ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన

CM YS Jagan Delhi tour concludes
  • రెండ్రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన సీఎం జగన్
  • ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ
  • పలువురు కేంద్రమంత్రులతోనూ సమావేశం
  • నేడు రాష్ట్రానికి తిరిగి రాక

ఏపీ సీఎం జగన్ రెండ్రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ఏపీకి తిరిగొచ్చేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇవాళ కూడా ఆయన బిజీగా గడిపారు. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కేంద్ర సమాచార ప్రసార, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లతో వరుసగా భేటీ అయ్యారు. సీఎం జగన్ నిన్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాలతో సమావేశం కావడం తెలిసిందే.

  • Loading...

More Telugu News