మళ్లీ రంగంలోకి దిగుతున్న రామ్!
- రామ్ తో లింగుసామి మూవీ
- మాస్ కంటెంట్ తో సాగే సినిమా
- కథానాయికగా కృతిశెట్టి
- ఈ నెల 5 నుంచి తాజా షెడ్యూల్
ఈ సినిమా తాజా షెడ్యూల్ ను ఈ నెల 5వ తేదీ నుంచి మొదలుపెడుతున్నట్టుగా ప్రకటించారు. 4 నెలల తరువాత మళ్లీ సెట్స్ పైకి వస్తున్నట్టుగా చెప్పారు. ఇందులో రామ్ జోడీగా కృతిశెట్టిని తీసుకున్నారు. ఇది మాస్ యాక్షన్ మూవీగానే రూపొందుతున్నట్టుగా తెలుస్తోంది. తమిళంలో లింగుసామికి మాస్ డైరెక్టర్ గానే ఒక ముద్ర ఉంది.
తమిళంలో ఆయన ఇంతకుముందు సూర్య .. కార్తి .. విశాల్ .. విక్రమ్ .. వంటివారితో చేసిన సినిమాలు మాస్ కంటెంట్ తో కూడినవే. అందువలన ఈ సినిమా కూడా ఆ జాబితాకు చెందినదిగానే చెప్పుకోవాలి. 'ఇస్మార్ట్ శంకర్' హిట్ తో మాస్ మార్కులు తెచ్చుకున్న రామ్ కూడా ఈ సినిమాపై గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడు.
.