కేశినేని నానికి కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు
- విజయవాడ పశ్చిమ సమన్వయకర్తగా కేశినేని నాని
- కమిటీలు నియమించే అధికారం అప్పగింత
- గతంలో ఏర్పాటు చేసిన కమిటీలు పక్కనబెట్టాలన్న టీడీపీ
- రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కార్యదర్శిగా మధుబాబు
కాగా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కేశినేని నానికి మరింత స్వేచ్ఛ కల్పించారు. డివిజన్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసే అధికారాన్ని కట్టబెట్టారు. గతంలో బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా నియమించిన కమిటీలను పక్కనబెట్టాలని టీడీపీ హైకమాండ్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా నియామకాలకు, నిర్ణయాలకు పార్టీ అధినేత చంద్రబాబు ఆమోదముద్ర వేశారు.