తెలంగాణలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
- స్థానిక సంస్థల కోటా కింద శుక్రవారం ఎన్నికలు
- 12 స్థానాలకు ఆరు ఏకగ్రీవం
- లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కరీంనగర్లోని రెండు స్థానాలకు 9, ఆదిలాబాద్లో 6, మెదక్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో ఐదేసి టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేసి ఓట్లను లెక్కిస్తున్నారు.